తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 536 కరోనా పాజిటివ్ కేసులు...
By: chandrasekar Wed, 16 Dec 2020 11:02 PM
రాష్ట్రంలో గడిచిన 24
గంటల్లో కొత్తగా 536 కరోనా
కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల
రేటు 0.53శాతంగా
ఉందని, అలాగే
రికవరీ రేటు 96.88శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రస్తుతం 7,183
యాక్టివ్ కేసులున్నాయని, మరో 5,041 మంది హోంఐసోలేషన్లో ఉన్నారని తెలిపింది.
దీంతో మొత్తం పాజిటివ్
కేసుల సంఖ్య 2,79,135కు చేరాయి. కొత్తగా 622 మంది మహమ్మారి నుంచి
కోలుకోగా ఇప్పటి వరకు 2,70,450 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మంగళవారం ఒకే
రోజు రాష్ట్రవ్యాప్తంగా 52,057 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటి వరకు 62,57,754 టెస్టులు చేసినట్లు వివరించింది. మరో ముగ్గురు వైరస్ ప్రభావంతో మృతి చెందగా
ఇప్పటి వరకు 1,502 మంది వైరస్కు బలయ్యారు.
Tags :
536 |
corona |
positive |
cases |