ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు...
By: chandrasekar Thu, 17 Dec 2020 1:07 PM
ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్
60
సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి యాభై శాతం తగ్గింపును ఇవ్వనుంది.
బుధవారం విమానయాన శాఖ ఈ పథకం గురించి
వెల్లడించింది. పథకం పూర్తి వివరాలను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్లో
వుంచారు. ప్రయాణించే వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండి 60 సంవత్సరాల పైన వయసు వారై
ఉండాలి. చెక్-ఇన్ సమయంలో ఐడీ చూపనిపక్షంలో ప్రాథమిక ఛార్జీలు జప్తు చేస్తారు.
ప్రయాణం రోజుకు కనీసం 7 రోజుల ముందు టికెట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం
ఉంటుందని కేంద్ర విమానయాన శాఖ పేర్కొన్నది.
ఇటువంటి పథకాన్ని ఎయిర్
ఇండియా ముందే అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం దీనిని ఇప్పుడు ఆమోదించింది. ఈ ఆఫర్
భారతదేశంలోని ఏ రంగానికైనా ప్రయాణానికి చెల్లుబాటవుతుంది. ఈ పథకం దేశీయ విమానాల
కోసం మాత్రమే. చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ, ఐడీపై పుట్టిన తేదీ ఉండాలి. ఎకానమీ క్యాబిన్ బుకింగ్
క్యాటగిరీకి అసలు ఛార్జీలలో 50 శాతం చెల్లించాలి.