Advertisement

  • దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి నాలుగు కోట్లకు పైగా హుండీ ఆదాయం..

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి నాలుగు కోట్లకు పైగా హుండీ ఆదాయం..

By: Sankar Tue, 27 Oct 2020 7:50 PM

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి నాలుగు కోట్లకు పైగా హుండీ ఆదాయం..


విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కరోనా కష్టకాలంలోనూ అశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించారు. ఈ మేరకు దుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా ఈ ఏడాది 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, వారిలో దాదాపు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయినట్లు గుర్తించినట్లు వారు చెప్పారు. ఆన్‌లైన్‌తో పాటు దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన వారికి 1,51,124 టికెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.4.36 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు వివరించారు.

కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

Tags :

Advertisement