Breaking News: పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను కిరాతకంగా గొంతు కోసి చంపేశారు..!
By: Anji Sun, 29 Nov 2020 11:08 PM
నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఇంకా కొంత మంది రైతుల ఆచూకీ తెలియడం లేదు.
నైజీరియాలోని మైదుగురి ప్రాంతంలో ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. ఈ ఘటనతో యావత్ నైజీరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దీనిని అమానుష ఘనటగా అభివర్ణించారు. చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. కాగా, ఈ దురాగతానికి పాల్పడింది బొకొ హరమ్ మిలిటెంట్లేనని అనుమానిస్తున్నారు.
Tags :
nigeria |