లాక్ డౌన్ తో భారత్లో చిక్కుకున్న 415 మంది పాకిస్థానీలు...తిరిగి మాతృభూమికి
By: chandrasekar Thu, 01 Oct 2020 09:50 AM
చికిత్స కోసం భారత్ కు
వచ్చిన పాకిస్తానీయులు చాలా మంది కరోనా లాక్ డౌన్ తో ఇక్కడే చిక్కుకున్నారు. కరోనా
కారణంగా భారత్లో చిక్కుకున్న 415 మంది పాకిస్థానీలు అట్టారి వాఘా బోర్డర్ ద్వారా
బుధవారం తమ మాతృభూమికి చేరుకున్నారు. ఇన్ని నెలల తరువాత తిరిగి తమ దేశానికి
వెళ్తుండటంపై పాకిస్థానీలు ఆనందం వ్యక్తం చేశారు. తాను క్యాన్సర్ చికిత్స కోసం ఏడు
నెలల క్రితం భారత్కు వచ్చి చిక్కుకున్నానని సురేష్ కుమార్ అనే పాకిస్థానీ
చెప్పుకొచ్చాడు.
తాము భారత దేశంలో ఇన్ని
నెలల పాటు ఉన్నప్పటికి ఎటువంటి అసౌకర్యానికి గురికాలేదని తెలిపాడు. అయిష్ చావ్లా
అనే మరో మహిళ డెలివరీ కోసం 16 నెలల క్రితం భారత్కు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయింది.
ఒంటరిగా వచ్చిన తాను ఇప్పుడు బిడ్డతో పాకిస్థాన్ వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె
చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం లాక్ డౌన్ సరళ
తరం చేయడంతో ఇలా వివిధ కారణాలతో భారత్కు
వచ్చి చిక్కుకుపోయిన వారంతా తిరిగి సురక్షితంగా తమ దేశానికి చేరుకోగలిగారు. కాగా
కరోనా టెస్ట్ రిపోర్టులను చూపించిన వారిని మాత్రమే బోర్డర్ ద్వారా పాకిస్థాన్కు
పంపుతున్నట్టు వాఘా బోర్డర్ దగ్గర పనిచేసే అధికారి అరుణ్ పాల్ సింగ్ తెలిపారు.
స్క్రీనింగ్ టెస్ట్లు, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ చేసేందుకు బోర్డర్ దగ్గర
ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు.