Advertisement

  • వరదనీటితో నిండుకుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్

వరదనీటితో నిండుకుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్

By: Sankar Wed, 16 Sept 2020 10:51 AM

వరదనీటితో నిండుకుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్


శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన మహారాష్ట్రలో, నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం 40 గేట్లను ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,21,013 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో దిగువకు 2,21,013 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగులు కాగా పూరిస్థాయిలో నిండింది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 90.31 టీఎంసీలు ఉంది. జలాశయం గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికారులు 40 గేట్లను అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.

అలాగే కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరుకు, వరద కాలువ ద్వారా మిడ్‌ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మధ్య మానేరుకు ఎగువ నుంచి వరద వస్తుండడంతో మంగళవారం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ గేట్లు ఎత్తి, లోయర్‌ మానేరు డ్యామ్‌కు నీటిని విడుదల చేశారు..ఇక మరోవైపు నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు కూడా జలశోభతో కళకళలాడుతున్నాయి. భారీగా నీరు చేరడంతో రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకావం ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.

Tags :
|

Advertisement