మెట్రో సూపర్ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ...
By: chandrasekar Sat, 17 Oct 2020 1:19 PM
హైదరాబాద్ మెట్రో దసరా
పండుగ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. మెట్రో ప్రయాణికులకు
ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం
రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
రేపట్నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని
పేర్కొన్నారు.
స్మార్ట్ కార్డు, ట్రిప్
కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ కల్పించాలని నిర్ణయించామన్నారు.
ట్రిప్ కార్డులపై రాయితీ రేపట్నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు వర్తించనుంది
అని స్పష్టం చేశారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్నవారికి 2 నెలల
వరకు రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు.
వరదల వల్ల నగరంలో
రోడ్లు దెబ్బతిన్నాయి అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వరద రోజున ఒక గర్భిణీ
కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపామని చెప్పారు. ప్రస్తుతం రోడ్ల మీద
ప్రయాణం కష్టంగా మారిందన్నారు. ఈ క్రమంలో మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించాలని
భావించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ట్రిప్పు కార్డులు
కొన్నవారికి...
14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20
ట్రిప్పులు తిరిగే అవకాశం.
20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30
ట్రిప్పులు తిరిగే అవకాశం.
40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60
ట్రిప్పులు తిరిగే అవకాశం.
7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30
రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం.