గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు..
By: Sankar Sun, 15 Nov 2020 05:41 AM
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి స్నానానికి వెళ్ళి నలుగురు యువకులు గల్లంతయిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికల గోదావరి రేవు వద్ద జరిగింది. వెంకటాపురం మండలం రంగరాయ పురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి స్నానానికి వెళ్ళగా అందులో నలుగురు యువకులు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది.
గల్లంతయిన వారి పేర్లు శ్రీకాంత్, కార్తీక్, అన్వేష్, ప్రకాష్ అని చెబుతున్నారు. ఇందులో ఒకరి పుట్టినరోజు కావడంతో వీరంతా గోదావరి తీరానికి వెళ్లారని అక్కడే భోజనం వండుకుని తిన్నారని ఆ తరువాత కేక్ కటింగ్ పూర్తయిన అనంతరం అందరూ కలిసి సరదాగా ఈత కొట్టేందుకు గోదావరిలో దిగారని చెబుతున్నారు. అయితే 16 మంది దిగగా 12 మంది పైకి వచ్చారు. మిగతా వారి అటువైపు చేరి ఉంటారని అనుమానం వ్యక్తం కాగా ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకి సమాచారం అందించారు.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చేపలతో పాటు మరో కూడా రంగంలోకి దింపి గోదావరి లోపలి దాకా వెళ్లి గాలిస్తున్నారు. గల్లంతైన వారి కోసం జాలర్లను పెట్టి వెతుకుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ప్రకాష్ మృతదేహం లభ్యం అయినట్టు చెబుతున్నారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.