Advertisement

  • చైతన్యపురి బస్సు స్టాప్ లో మద్యం సవించి యువతుల హల్చల్

చైతన్యపురి బస్సు స్టాప్ లో మద్యం సవించి యువతుల హల్చల్

By: Sankar Sun, 23 Aug 2020 3:04 PM

చైతన్యపురి బస్సు స్టాప్ లో మద్యం సవించి యువతుల హల్చల్


హైదరాబాద్‌‌లో నలుగురు యువతులు ఫూటుగా మద్యం సేవించి నానా రభస చేశారు. దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఈ ఘటన జరిగింది. స్థానిక కనకదుర్గ వైన్స్ దుకాణం సమీపంలో యువతులు హల్‌చల్‌ చేశారు.

శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్షంగా చూసిన వారి వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్‌ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో కూర్చున్నారు. వైట్‌నర్‌ పీల్చుతూ మద్యం కొనేందుకు వచ్చిన వారితో, రోడ్డు వెంట వెళ్తున్నవారితో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు.

పాదచారులపై అకారణంగా దాడులు కూడా చేస్తూ నానా హంగామా సృష్టించారు. తమ వద్ద ఆ యువతులు డబ్బులు కూడా లాక్కున్నారని కొంత మంది స్థానికులు ఆరోపించారు. రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడిపై దాడి చేశారు. అక్కడే బస్‌స్టాప్‌లో పడుకుని ఉన్న మరో యువకుడి బట్టలిప్పి యువతులు రౌడీల్లా వ్యవహరించారని తెలిపారు. మైకంలో ఉన్న యువతులు విచ్చలవిడిగా ప్రవర్తించారని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఇంత రభస జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :
|
|
|

Advertisement