Advertisement

హైదరాబాద్ నుంచి 3000 ఆర్టీసీ బస్సులు

By: Sankar Tue, 20 Oct 2020 10:13 AM

హైదరాబాద్ నుంచి 3000 ఆర్టీసీ బస్సులు


దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు 3000లని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.

ఈ నెల 15 నుండి 24 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 15-10-20 నుండి నిన్నటి వరకు ఎంజిబిఎస్, జెబిఎస్ మధ్య 281 ప్రత్యేక బస్సులు నడిచాయని, ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు కాక తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడవనున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఎంజీబీఎస్ ,జేబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎస్సార్ నగర్, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి 24 మధ్య 2034 బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల పండుగ రద్దీదృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కల్పించామని ఆయన పేర్కొన్నారు.

Tags :
|

Advertisement