Advertisement

కుప్పకూలిన 3 అంతస్తుల భవనం..8 మంది మృతి

By: Anji Mon, 21 Sept 2020 07:27 AM

కుప్పకూలిన 3 అంతస్తుల భవనం..8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. అర్దరాత్రి ఫ్లాట్ల నివాసులు గాఢనిద్రలో ఉన్న సమయంలో మూడంతస్తుల భవనం సగం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 8 మంది మరణించిన ఘటన మహారాష్ట్రలోని బీవండీ నగరంలో జరిగింది. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం అర్దరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.


ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మూడు అంతస్తుల 69వనంబరు జిలానీ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. ఈ భవనం కూలిపోవడంతో స్థానికులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయిన 25 మందిని స్థానికులు రక్షించారు.


మరో 20 నుంచి 25 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బీవండీ నగరంలోని పటేల్ కాంపౌండులో గందరగోళం నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టింది.

Tags :
|

Advertisement