Advertisement

ఏపీలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Wed, 28 Oct 2020 8:16 PM

ఏపీలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. ఏపీలో ఈ రోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,949 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 814774కి చేరింది. ఇందులో 781509 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 26622 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6643కి చేరింది.

ఇక ఇదిలా ఉంటె, ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 192, చిత్తూరులో 315, తూర్పుగోదావరి జిల్లాలో 417, గుంటూరులో 421, కడపలో 193, కృష్ణాలో 457, కర్నూలులో 32, నెల్లూరులో 76, ప్రకాశంలో 99, శ్రీకాకుళంలో 74, విశాఖపట్నంలో 114, విజయనగరంలో 67, పశ్చిమ గోదావరిలో 492 కేసులు నమోదయ్యాయి.

Tags :
|

Advertisement