Advertisement

  • కామారెడ్డి లో విషాదం ..పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 25 మందికి గాయాలు

కామారెడ్డి లో విషాదం ..పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 25 మందికి గాయాలు

By: Sankar Thu, 31 Dec 2020 10:32 AM

కామారెడ్డి లో విషాదం ..పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 25  మందికి గాయాలు


దోమకొండ శివారులో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాలు.. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల సంతోష్ వివాహం ఈ నెల 28న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఇంట్లో బుధవారం ఫంక్షన్‌ ఉండటంతో ఉదయం పెళ్ళికొడుకు తరఫున సుమారు 25 మంది ట్రాక్టర్‌లో చింతామన్ పల్లి గ్రామం నుంచి బయలుదేరారు.

శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో దోమకొండ శివారులోని దొంగల మర్రి ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పింది..గాయపడిన వారిని కామారెడ్డిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా నడపడం వలన ప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement