Advertisement

మత్స్యకారుడి వలకు చిక్కిన 25 కేజీల భారీ చేప...!

By: Anji Sat, 19 Dec 2020 12:04 PM

మత్స్యకారుడి వలకు చిక్కిన 25 కేజీల భారీ చేప...!

తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుడి వలకు అరుదైన చేప చిక్కింది. ఉప్పాడ చేపల రేవులో ఓ మత్స్యకారుడి వలకు భారీ నెమలి కోనెం చేప దొరికింది.

ఆరు అడుగుల పొడవు, 25 కిలోల బరువు ఉండటంతో వ్యాపారులు పోటీపడి ఈ చేపను కొనుగోలు చేశారు. ఈ చేప మూతి పొడవుగా, శరీరంపై పింఛం ఉండటంతో నెమలి కోనెంగా పిలుస్తారని మత్స్యకారులు అంటున్నారు.

ఇలాంటి చేపలు అరుదుగా వలకు చిక్కుతుంటాయని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడలో పొడవైన చేప అందర్ని ఆశ్చర్యపరిచింది. నగరంలోని కుంభాభిషేకంలో ఉన్న ఓ మార్కెట్‌లో ఈ అరుదైన చేప కనిపించింది.

స్థానిక మత్స్యకారుడు ఈ అరుదైన చేపను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ విచిత్రమైన చేపను చూసి.. పాము అనుకుని స్థానికులు ముందు భయపడ్డారు. ఇది పాము కాదు.. చేసని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇది సముద్రపు చేప అని మత్స్యకారుడు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ చేప ఏకంగా 10 అడుగుల పొడవు ఉంది.. తర్వాత ఈ చేపను ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ చేపను మెరైన్ ఈల్ అంటారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు

Tags :

Advertisement