Advertisement

తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

By: Sankar Fri, 21 Aug 2020 09:10 AM

తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ కాస్త పెరుగుతోంది. మొన్నటి వరకు 2 వేలకు దిగువన కేసులు నమోదు కాగా.. చాలా రోజుల తర్వాత రెండు వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. గురువారం బులిటెన్‌లో 1967 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసులు 99,391కు చేరింది. గురువారం 26,767 కరోనా టెస్టులు చేయగా.. మొత్తం 8,48,078కి టెస్టులు నిర్వహించారు. మరో 1300 టెస్టుల ఫలితం రావాల్సి ఉంది. 24 గంటల్లో 8మంది కరోనా కారణంగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 737కి చేరింది.

, v పరిధిలో 473 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు, మేడ్చల్ జిల్లాలో 170 కేసులు, వరంగల్ అర్బన్‌లో 101 కేసులు, కరీంనగర్‌లో 86 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో 81, ఖమ్మం జిల్లాలో 79, నిజామాబాద్ జిల్లాలో 69, గద్వల్ జిల్లా 55, కామారెడ్డి జిల్లాలో 55, సిద్దిపేట జిల్లాలో 49, మంచిర్యాల జిల్లాలో 40 కేసుల చొప్పన నమోదయ్యాయి.

గురువారం 1781 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,967కు చేరింది. రికవరీ రేటు 77.43 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,687గా ఉంది. వీరిలో 13,332 మంది హోం ఐసోలేషన్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

Tags :
|

Advertisement