Advertisement

  • తెలంగాణాలో భారీగానే కరోనా కేసులు.. తాజాగా 9 మంది మృతి

తెలంగాణాలో భారీగానే కరోనా కేసులు.. తాజాగా 9 మంది మృతి

By: Sankar Sun, 27 Sept 2020 11:10 AM

తెలంగాణాలో భారీగానే కరోనా కేసులు.. తాజాగా 9 మంది మృతి


తెలంగాణాలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,85,833కి చేరింది.

ఇవాళ ఒక్కరోజే కరోనాతో మరో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1100 కి పెరిగింది. కరోనా బారి నుంచి ఒక్క రోజే 2,058 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,54,499కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,234యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో 297 కొత్త కేసులు నమోదయ్యాయి.

తాజాగా 50,108 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... తెలంగాణలో మొత్తం కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 28,50,869కి చేరింది. ఇక తెలంగాణాలో రికవరీ రేటు 83.13% శాతంగా ఉండగా.. మరణాలు 0.59 శాతంగా ఉన్నాయి.

Tags :
|

Advertisement