Advertisement

  • ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా కేసులు ..ఒక్కరోజే రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు ..

ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా కేసులు ..ఒక్కరోజే రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు ..

By: Sankar Sun, 12 July 2020 3:49 PM

ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా కేసులు ..ఒక్కరోజే రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు ..



ఏపీలో కరోనా తీవ్రరూపం దాల్చింది ..రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..మరోవైపు తెలంగాణాలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ..ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం బులిటెన్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 17,624 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 1,914 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 18 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకింది ..దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 1933కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,168కు చేరింది.

గడచిన 24 గంటల్లో 19 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. గడిచిన 24 గంటల్లో 846 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని నమోదైన మొత్తం 29,168 పాజిటివ్ కేసులకు గాను 13,428 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,412కు చేరుకుంది.

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 268 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 237 కేసులు, అనంతపురం జిల్లాలో 129, చిత్తూరులో 159, గుంటూరులో 152, కడపలో 94, కృష్ణా జిల్లాలో 206, నెల్లూరులో 124, ప్రకాశంలో 134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, పశ్చిమ గోదావరి జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి

Tags :
|
|
|

Advertisement