తెలంగాణ లో ఆగని కరోనా ఉదృతి ..బుధవారం 191 కేసులు నమోదు
By: Sankar Thu, 11 June 2020 08:06 AM
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే 191 కరోనా
పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 4,111కు చేరింది. మొత్తంగా 156 మంది ప్రాణాలు కోల్పోగా, 1,817 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో 143 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్నగర్ 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3, నగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.