Advertisement

19 మంది భారతీయులు పాక్‌ కస్టడీలో..

By: chandrasekar Tue, 08 Sept 2020 3:49 PM

19 మంది భారతీయులు పాక్‌ కస్టడీలో..


పాకిస్థాన్‌ అధికారులు చట్టవిరుద్ధంగా సరిహద్దులను దాటి తమ దేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ 19 మంది భారతీయులను అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని అధికారి ఒకరు తెలిపారు.

ఇదే కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9న పాక్‌ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని ప్రకటించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు.

Tags :
|
|

Advertisement