Advertisement

తెలంగాణాలో కొత్తగా 1850 కరోనా కేసులు...

By: Sankar Sun, 05 July 2020 09:23 AM

తెలంగాణాలో కొత్తగా 1850 కరోనా కేసులు...



తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి తగ్గడం లేదు .. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1850 కొత్త కేసులను గుర్తించగా.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 22,312కు చేరింది. అదే సమయంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. కాగా ఇవాళ 1342 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు ..

తెలంగాణలో ఇప్పటి వరకూ 1,10,545 టెస్టులు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసులు ఉండగా.. 11,537 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం 5,965 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు 1892 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1658 కేసులను గుర్తించారు. శుక్రవారం 1126 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కాగా రోజు లాగే ఈరోజు కూడా హైదరాబాద్‌లో 1572 పాజిటివ్ కేసులను గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్‌లో 53 కేసులను గుర్తించారు. వరంగల్ అర్బన్‌లో 31 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్గొండ పది కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో ఏడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు కేసులను గుర్తించారు.బోనగిరి , మెదక్ లలో ఒక్కొక కేసు నమోదు అవ్వగా , గద్వాల్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి ..ఇక సంగారెడ్డిలో ఎనిమిది , సిరిసిల్ల మూడు , సిద్ధిపేట , జగిత్యాలలో అయుదు కేసులు నమోదు అయ్యాయి ..మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 22 జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|

Advertisement