Advertisement

బస్సు , రైలు డీ ..పదిహేడుమంది మృతి

By: Sankar Sun, 11 Oct 2020 4:38 PM

బస్సు , రైలు డీ ..పదిహేడుమంది మృతి


థాయిలాండ్ లో ప్రమాదవశాత్తు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 29 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బ్యాంకాంక్ నుంచి సాచియావో లోని ఆలయం వద్దకు వెళ్తున్న టూరిస్ట్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రైలు బస్సును ఢీకొట్టడంతో బస్సు తిరగబడింది. మృతదేహాలు ట్రాక్ పక్కన చెల్లాచెదురుగా పడిపోయాయి. క్రేన్ సహాయంతో బస్సును యధాస్థితికి తీసుకొచ్చిన అధికారులు, గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో భారీగా వర్షం కురుస్తుండటంతో రైలు వస్తున్నట్టు బస్సు డ్రైవర్ గుర్తించలేకపోయారు. దీంతో ప్రమాదం జరిగిందని థాయ్ అధికారులు చెప్తున్నారు.

Tags :
|
|

Advertisement