Advertisement

  • తెలంగాణలో శుక్రవారం 1640 కరోనా కేసులు నమోదు...మరణాల సంఖ్య 455

తెలంగాణలో శుక్రవారం 1640 కరోనా కేసులు నమోదు...మరణాల సంఖ్య 455

By: chandrasekar Sat, 25 July 2020 08:05 AM

తెలంగాణలో శుక్రవారం 1640 కరోనా కేసులు నమోదు...మరణాల సంఖ్య 455


తెలంగాణలో శుక్రవారం మొత్తం 1640 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,677గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1007 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 40,334 కు చేరింది. అంటే బాధితుల రికవరీ రేటు 76.8 శాతంగా బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక శుక్రవారం మరో 8 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 455కి చేరింది. మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా 0.86 శాతంగా ఉంది.

శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 683 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 235 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 102 కొత్త కరోనా కేసులను గుర్తించారు.

దాని తర్వాతి స్థానంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా ఉంది. ఇక్కడ 100 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 15,445 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1640 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 3,37,771కు చేరింది.

Tags :

Advertisement