Advertisement

  • మహారాష్ట్ర పోలీస్ శాఖలో 161 మందికి కరోనా ..ఒకరు మృతి

మహారాష్ట్ర పోలీస్ శాఖలో 161 మందికి కరోనా ..ఒకరు మృతి

By: Sankar Sun, 30 Aug 2020 2:07 PM

మహారాష్ట్ర పోలీస్ శాఖలో 161 మందికి కరోనా ..ఒకరు మృతి


మహారాష్ట్ర పోలీసులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి రోజు వందల మందికి వైరస్ సోకుతున్నది. తాజాగా శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 161 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనా వ్యాప్తించిన పోలీసుల సంఖ్య 14,953కు చేరింది.

మరోవైపు కరోనాకు చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మరణించారు. దీంతో వైరస్ వల్ల మరణించిన పోలీసుల సంఖ్య 154కు చేరింది. అయితే ఇప్పటి వరకు 11,999 మంది కాప్స్ కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,800 యాక్టివ్ కేసులు ఉండగా వారంతా చికిత్స పొందుతున్నారు.

కరోనా పోరులో ముందున్న వారిలో ఒకరైన పోలీసులు వైరస్ బారిన పడుతుండటంతో మహారాష్ట్రలో వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా కేసుల పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7.64 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 24 వేలకుపైగా మరణించారు.

Tags :
|
|
|

Advertisement