Advertisement

  • ఏపీలో భారీగా కరోనా కేసులు ...ఒక్క రోజే 1608 పాజిటివ్ కేసులు

ఏపీలో భారీగా కరోనా కేసులు ...ఒక్క రోజే 1608 పాజిటివ్ కేసులు

By: Sankar Fri, 10 July 2020 4:07 PM

ఏపీలో భారీగా కరోనా కేసులు ...ఒక్క రోజే 1608 పాజిటివ్ కేసులు



ఏపీలో కరోనా అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది ..రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..టెస్ట్లు పెంచే కొద్దీ కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి..గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 25422కు చేరింది. గడచిన 24 గంటల్లో 15మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 292కి చేరింది. గత 24 గంటల్లో 981మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 11936 నమోదయ్యింది. మరో 11936మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురం జిల్లాలో 191, తూర్పగోదావరి జిల్లాలో 169, కర్నూలు జిల్లాలో 144, పశ్చిమగోదావరి జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 136, ప్రకాశం జిల్లాలో 110, కడప జిల్లాలో 91, విశాఖపట్నం జిల్లాలో 86, విజయనగరం జిల్లాలో 86, శ్రీకాకుళం జిల్లాలో 80, కృష్ణా జిల్లాలో 80, నెల్లూరు జిల్లాలో 51 రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2939 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2850కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2799 కేసులు ఉన్నాయి.

Tags :
|
|

Advertisement