Advertisement

  • లారా మిస్టరీ కేసు వీడింది ..నాలుగు రోజుల తర్వాత ఇంటికి చేరిన బాలిక

లారా మిస్టరీ కేసు వీడింది ..నాలుగు రోజుల తర్వాత ఇంటికి చేరిన బాలిక

By: Sankar Mon, 12 Oct 2020 11:56 AM

లారా మిస్టరీ కేసు వీడింది ..నాలుగు రోజుల తర్వాత ఇంటికి చేరిన బాలిక


ఎట్టకేలకు 16 ఏళ్ల లారా అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం ...పేరెంట్స్ మందలించారని ఇంటి అర్ధరాత్రి ఇంటి నుండి వెళ్లిపోయిన లారా...చివరికి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 7 బృందాలుగా లారా కోసం గాలించారు హయత్ నగర్ పోలీసులు.

ఇంటి నుంచి పారిపోయిన లారా.. నాలుగు రోజులుగా ఇంటికి సమీపంలోని చెట్ల పొదల్లోనే గడిపింది. దీనిపై లారా తల్లి అపర్ణ ఎన్టీవీతో మాట్లాడుతూ...జంతువులు అంటే లారా కు భయం లేదని... అందుకే చెట్ల పొదల్లో గడిపిందని తెలిపింది. మాది జంతుప్రేమికుల కుటుంబమని పేర్కొంది. నాలుగు రోజులుగా కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకపోవడంతో నీరసం అయి..దగ్గర లోని గుడిసె వద్దకు వెళ్ళింది... వాళ్ళు లారా ను ఇంటికి తీసుకు వచ్చారని తెలిపింది.

మొబైల్ లో చాటింగ్ చేయొద్దు , గేమ్స్ ఆడొద్దు అని పేరెంట్స్ చెబితే అది పిల్లల మంచికే అని గుర్తించాలని చెప్పింది. మా పాప క్షేమంగా ఇంటికి చేరడం..మా జీవితంలో మరిచిపోలేని రోజు అని లారా తల్లి అపర్ణ తెలిపింది.

Tags :
|

Advertisement