Advertisement

16 మంది హత్య... 25 మంది కిడ్నప్

By: Anji Sat, 26 Sept 2020 7:45 PM

16 మంది హత్య... 25 మంది కిడ్నప్

చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. కరోనా సమయంలో అందరూ మహమ్మారిపై దృష్టి సారించిన సమయంలో మావోయిస్టులు మాత్రం తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు.

కుర్చేలి గ్రామానికి చెందిన 16 మందిగ్రామస్తులను హత్య చేశారు. ఇటీవలే 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతు కోసి హతమార్చారు.

అనంతరం ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉంచుకున్న 16 మందిని ఈ రోజు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

Advertisement