Advertisement

  • తెలంగాణాలో కొంచెం శాంతించిన కరోనా ..నిన్న 1410 కేసులు నమోదు

తెలంగాణాలో కొంచెం శాంతించిన కరోనా ..నిన్న 1410 కేసులు నమోదు

By: Sankar Fri, 10 July 2020 07:45 AM

తెలంగాణాలో కొంచెం శాంతించిన కరోనా ..నిన్న 1410 కేసులు నమోదు



తెలంగాణాలో కరోనా కేసులు కొద్దిగ్గా తగ్గుముఖం పట్టాయి ..గత వారం నుంచి నమోదు అయితున్న పాజిటివ్ కేసులతో పోలిస్తే గురువారం నాడు కొంచెం తక్కువ సంఖ్యలో నమోదు అయ్యాయి ..గురువారం మొత్తం 1,410 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,946కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,423గా ఉన్నాయి. గత 24 గంటల్లో 913 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 18,192కు చేరింది. ఇక గురువారం మరో ఏడుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 331కి చేరింది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 918 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 125 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 79 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో గురువారం మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 67 కేసులు నమోదయ్యాయి.

నిన్న తెలంగాణాలో హైదరాబాద్ తో కలిపి మొత్తం 28 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 5,954 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,410 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,40,755కు చేరింది. గురువారం 4,544 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

Tags :
|
|
|
|

Advertisement