పబ్ జి ఆడనివ్వలేదు అని పద్నాలుగేళ్ల బాలుడు ఆత్మహత్య
By: Sankar Thu, 10 Dec 2020 9:16 PM
పబ్జీ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్జీకి బానిసలైనవారిని ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. పబ్జీ ఆటపై మోజు ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది. తండ్రి.. ఫోన్లో పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ముక్తానంద్ (14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కులకచర్ల మండలం బండేలకచర్లలో ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...కాగా దేశంలో పబ్ జి ఆట మీద నిషేధం విధించిన విషయం తెలిసిందే..
Tags :
14 years |
boy |
commits |
suicide |