Advertisement

  • 139 మంది అత్యాచారం ఆరోపణలకేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ...!

139 మంది అత్యాచారం ఆరోపణలకేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ...!

By: Anji Fri, 23 Oct 2020 9:27 PM

139 మంది అత్యాచారం ఆరోపణలకేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ...!

139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు.. సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ చేసినట్టు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.

“ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము.

ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.” అని మహంతి వెల్లడించారు.

Tags :
|
|

Advertisement