Advertisement

  • 2018, 2017 బ్యాచ్ కు చెందిన 131 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి

2018, 2017 బ్యాచ్ కు చెందిన 131 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి

By: chandrasekar Fri, 04 Sept 2020 9:45 PM

2018, 2017 బ్యాచ్ కు చెందిన 131 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి


నేడు ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ ప‌రేడ్ న‌గర శివార్ల‌లోని స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ జాతీయ పోలీస్ అకాడ‌మీలో జ‌ర‌గ‌నున్న‌ది. 2018, 2017 బ్యాచ్‌కు చెందిన 131 మంది ఐపీఎస్‌లు విజ‌యంతంగా శిక్ష‌ణ ముగించుకున్నారు.

ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ల‌కు స్ఫూర్తి సందేశం ఇవ్వబోతున్నారు.

శిక్ష‌ణ పూర్తిచేసుకున్నవారిలో 121 మంది 2018 బ్యాచ్‌కు చెందిన‌వారుకాగా, మ‌రో ప‌ది మంది 2017 బ్యాచ్‌కు చెందిన‌వారు.

ఇందులో 28 మంది మ‌హిళా ప్రొబేష‌న‌ర్లు ఉన్నారు. పాసింగ్ ఔట్ ప‌రేడ్‌కు త‌మిళ‌నాడు కేడ‌ర్‌కు చెందిన కిర‌ణ్ శృతి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారిలో 11 మంది ఐపీఎస్‌ల‌ను తెలంగాణ‌కు, ఐదుగురిని ఆంధ్ర‌ప్రదేశ్‌కు కేటాయించారు.

Tags :

Advertisement