ఉత్తరప్రదేశ్లో వేల ఏళ్లనాటి 128 పురాతన నాణేలు లభ్యం...
By: chandrasekar Mon, 14 Dec 2020 10:53 PM
ఉత్తరప్రదేశ్లోని మహమ్మదాబాద్
ఘోహ్నా తెహసిల్ గ్రామంలో 128 పురాతన నాణేలు లభించాయి. ఈ విషయం తెలియగానే ఆ
ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ డైరెక్టరేట్
స్వాధీనం చేసుకున్నారు. ఓ కుండలో వేల ఏళ్ల కిందట నాణేలను పెట్టి
దాచిపెట్టినట్లు సమాచారం. ఇంకా వీటితోబాటు బంగారం మరియు వివిధ లోహాలతో తయారు చేసిన
నాణేలు ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా మెజిస్ట్రేట్
అమిత్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ఈ నాణేలు 1500 నుంచి 2వేల ఏళ్లనాటివి కావచ్చని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో
కూడా కొన్ని రోజుల ముందు ఇలాగే అక్కడ లభించిన ఓ మట్టి కుండలో వందలాది బంగారు
నాణేలు ఉన్నాయి. అవి కూడా కొన్ని వేల ఏళ్లనాటివేనని సమాచారం.కానీ, అవి ఏ
కాలానికి చెందినవనేది ఇంకా తెలియలేదు.
Tags :
128 |
thousand |
year old |
found |