Advertisement

  • ఉత్తరప్రదేశ్‌లో వేల ఏళ్లనాటి 128 పురాతన నాణేలు లభ్యం...

ఉత్తరప్రదేశ్‌లో వేల ఏళ్లనాటి 128 పురాతన నాణేలు లభ్యం...

By: chandrasekar Mon, 14 Dec 2020 10:53 PM

ఉత్తరప్రదేశ్‌లో వేల ఏళ్లనాటి 128 పురాతన నాణేలు లభ్యం...


ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ఘోహ్నా తెహసిల్ గ్రామంలో 128 పురాతన నాణేలు లభించాయి. ఈ విషయం తెలియగానే ఆ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు. ఓ కుండలో వేల ఏళ్ల కిందట నాణేలను పెట్టి దాచిపెట్టినట్లు సమాచారం. ఇంకా వీటితోబాటు బంగారం మరియు వివిధ లోహాలతో తయారు చేసిన నాణేలు ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ఈ నాణేలు 1500 నుంచి 2వేల ఏళ్లనాటివి కావచ్చని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో కూడా కొన్ని రోజుల ముందు ఇలాగే అక్కడ లభించిన ఓ మట్టి కుండలో వందలాది బంగారు నాణేలు ఉన్నాయి. అవి కూడా కొన్ని వేల ఏళ్లనాటివేనని సమాచారం.కానీ, అవి ఏ కాలానికి చెందినవనేది ఇంకా తెలియలేదు.

Tags :
|
|

Advertisement