Advertisement

  • సంగారెడ్డిలో ఒకే కుటుంబంలో పన్నెండు మందికి కరోనా ..

సంగారెడ్డిలో ఒకే కుటుంబంలో పన్నెండు మందికి కరోనా ..

By: Sankar Sun, 19 July 2020 11:10 AM

సంగారెడ్డిలో ఒకే కుటుంబంలో పన్నెండు మందికి కరోనా ..



కరోనా మహమ్మరి దెబ్బకు ప్రజలు అతలాకుతకాలం అవుతున్నారు ..ఇంట్లో ఒకరికి వస్తే అది అందరికి పాకుతుండటంతో అందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ..అయితే తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుంబం పట్టణంలోని ఆర్‌టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు.

ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్‌ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్‌ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్‌ కాలనీలో ఒకరికి, మారుతీనగర్‌లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు.

తాజాగా తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో మరో 1,284 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,780 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 30,607 యాక్టివ్‌ కేసులున్నాయి..తాజాగా సంగారెడ్డి జిల్లాలో 86 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|

Advertisement