Advertisement

  • గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనా తో 117 మంది మృతి

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనా తో 117 మంది మృతి

By: Sankar Thu, 05 Nov 2020 8:38 PM

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనా తో 117 మంది మృతి


మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి.

బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,246 పాజిటివ్‌ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,03,444కు, మరణాల సంఖ్య 44,804కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 11,277 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,51,282కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,06,519 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Tags :
|
|

Advertisement