10 మంది ఉగ్రవాదుల హతం
By: chandrasekar Tue, 13 Oct 2020 2:59 PM
గత అయిదు రోజుల్లో జమ్మూకశ్మీర్లో 4 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని, దాంట్లో
పది మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్ సింగ్
ప్రకటించారు.
డీజీపీ మీడియాతో
మాట్లాడుతూ.. లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లాతో పాటు పాక్ ఉగ్రవాది ఇర్షాద్ను
హతమార్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది 75 ఆపరేషన్లు
సక్సెస్ఫుల్గా నిర్వహించామని, వాటిల్లో 180 మంది ఉగ్రవాదులను హతమార్చామని ఆయన అన్నారు.
వేరువేరు ఘటనల్లో
సుమారు 138 మంది
ఉగ్రవాదులను, వారి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన
వెల్లడించారు. ఈ ఏడాది తమ ఆపరేషన్లు రికార్డు సృష్టించాయని దిల్బాగ్ సింగ్
తెలిపారు.
Tags :
killed |
bharat |