Advertisement

10 మంది ఉగ్ర‌వాదుల హ‌తం

By: chandrasekar Tue, 13 Oct 2020 2:59 PM

10 మంది ఉగ్ర‌వాదుల హ‌తం


గ‌త అయిదు రోజుల్లో జ‌మ్మూక‌శ్మీర్‌లో 4 ఎదురుకాల్పుల ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, దాంట్లో ప‌ది మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్ ప్రకటించారు.

డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ సైఫుల్లాతో పాటు పాక్ ఉగ్ర‌వాది ఇర్షాద్‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ఏడాది 75 ఆప‌రేష‌న్లు స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించామ‌ని, వాటిల్లో 180 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చామని ఆయన అన్నారు.

వేరువేరు ఘ‌ట‌న‌ల్లో సుమారు 138 మంది ఉగ్ర‌వాదుల‌ను, వారి అనుచ‌రుల‌ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ఏడాది తమ ఆప‌రేష‌న్లు రికార్డు సృష్టించాయ‌ని దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

Tags :
|
|

Advertisement