ఆఫ్ఘాన్లో తాలిబన్ బాంబు దాడులలో 10 మంది భద్రతా సిబ్బంది మృతి
By: chandrasekar Thu, 08 Oct 2020 5:38 PM
తాలిబన్లు
ఆఫ్ఘానిస్థాన్లో రక్తపాతం సృష్టించారు. రెండు వేర్వేరు నగరాల్లో బాంబు దాడులతో
విరుచుకుపడ్డారు.
జబూల్ ప్రావిన్స్ షహ్ర్
ఎ సఫా జిల్లాలోని సెక్యూరిటీ చెక్పాయింట్పై తాలిబన్లు జరిపిన దాడుల్లో
ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
అఫ్ఘానిస్థాన్ సైన్యం ఈ
విషయాన్ని ప్రకటించిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జబూల్ దాడికి
ముందు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో సైతం తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడ్డారు.
ఆ ఘటనలో కూడా నలుగురు
ఆఫ్ఘాన్ సైనికులు మృతిచెందారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
Tags :
killed |