Advertisement

  • ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్ బాంబు దాడుల‌లో 10 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్ బాంబు దాడుల‌లో 10 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

By: chandrasekar Thu, 08 Oct 2020 5:38 PM

ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్ బాంబు దాడుల‌లో 10 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మృతి


తాలిబ‌న్‌లు ఆఫ్ఘానిస్థాన్‌లో ర‌క్త‌పాతం సృష్టించారు. రెండు వేర్వేరు న‌గ‌రాల్లో బాంబు దాడుల‌తో విరుచుకుప‌డ్డారు.

జ‌బూల్ ప్రావిన్స్ ష‌హ్ర్ ఎ స‌ఫా జిల్లాలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పై తాలి‌బ‌న్‌లు జ‌రిపిన దాడుల్లో ఆరుగురు భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ర‌ణించారు.

అఫ్ఘానిస్థాన్ సైన్యం ఈ విష‌యాన్ని ప్రకటించిందని అక్క‌డి మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. జ‌బూల్ దాడికి ముందు ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో సైతం తాలిబ‌న్‌లు బాంబు దాడుల‌కు పాల్ప‌డ్డారు.

ఆ ఘ‌ట‌న‌లో కూడా న‌లుగురు ఆఫ్ఘాన్ సైనికులు మృతిచెందారు. మ‌రో ముగ్గురు సైనికులు గాయ‌ప‌డ్డారు.

Tags :
|

Advertisement