చిట్స్ పేరుతో పది కోట్లు తీసుకోని ఉడాయించిన జంట
By: Sankar Fri, 11 Dec 2020 5:02 PM
చీటీల పేరుతో రూ. 10 కోట్లు వసూలు చేసిన భార్య భర్తలు ఇల్లు వదిలి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట బండ్లగూడ పటేల్నగర్లో చోటుచేసుకుంది.
జి. బాబురావు, అంజలీదేవి ఇరువురు దంపతులు. గత 25 ఏళ్లుగా ఇదే కాలనీలో నివసిస్తున్నారు. ఇరుగుపొరుగువారు, స్థానికుల నుంచి చీటీల పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేశారు. నగదు జమ అనంతరం డబ్బును తీసుకుని ఇంటికి తాళం వేసి పారిపోయారు.
ఇక బాబురావు సిఆర్పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి కాగా 25 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉంటుందని భావించి చిట్స్ వేశామని బాధితులు చెబుతున్నారు..అయితే అంజలి చిట్ ఫండ్స్ మాత్రమే కాక పెద్ద మొత్తంలో తక్కువ ఇంట్రెస్ట్ కు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.