ఏపీలో కొత్తగా 1,221 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
By: chandrasekar Sat, 21 Nov 2020 10:51 AM
ఏపీలో కొత్తగా 1,221 కరోనా
వైరస్ పాజిటివ్ కేసులు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో గురువారం ఉదయం 9 గంటల
నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 1,221 కరోనా వైరస్ పాజిటివ్
కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 8,59,932కి చేరింది. ప్రస్తుతం 15,382 యాక్టివ్ కేసులు ఉండగా 8,37,630 మంది కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో గడచిన 24
గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 6,920కు
చేరుకుంది. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల విషయానికొస్తే అనంతపురం జిల్లాలో 41, చిత్తూరు
జిల్లాలో 175, తూర్పుగోదావరి జిల్లాలో 202, గుంటూరు
జిల్లాలో 144, కడప జిల్లాలో 65,
కృష్ణా జిల్లాలో 198,
కర్నూలు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 47, ప్రకాశం
జిల్లాలో 50, శ్రీకాకుళం జిల్లాలో 34, విశాఖపట్నం జిల్లాలో 69, విజయనగరం
జిల్లాలో 32, పశ్చిమ గోదావరి జిల్లాలో 145
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణ జిల్లాలో నమోదు చేయబడింది.