'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో యంగ్ టైగర్...
By: chandrasekar Sat, 12 Dec 2020 8:06 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్.
తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన బిగ్ బాస్ సీజన్- 1తో
బుల్లితెరపైకి వచ్చి ప్రశంసలందుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత బిగ్
బాస్ సీజన్లలో ఎన్టీఆర్ కనిపించలేదు. తాజాగా బుల్లితెరపై ప్రసారం కానున్న మరో
పాపులర్ షోకి హోస్ట్గా చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది.
బుల్లితెరపై మరో షో 'కౌన్
బనేగా కరోడ్ పతి' తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ఈ షో ప్రసారం
అయింది కానీ హిందీలో వచ్చిన టీఆర్ఫీ తెలుగులో రాలేదు. హీరోలు నాగార్జున, చిరంజీవిలు
హోస్ట్ చేసినా అనుకున్న ఫలితం రాలేదట. అందుకోసం ఎన్టీఆర్ని రంగంలోకి
దించుతున్నారని తెలుస్తోంది.
జెమినీ టీవీలో ఈ 'మీలో
ఎవరు కోటీశ్వరుడు' షో ప్రసారం కానుందట. జెమినీ యాజమాన్యం 'మీలో
ఎవరు కోటీశ్వరుడు' టైటిల్తో పాటు షోలో కొన్ని మార్పులు చేసిందట.
అదేవిధంగా ఈ షో హోస్ట్ చేసినందుకు గాను ఎన్టీఆర్ని ఒప్పించడంలో విశ్వ ప్రయత్నాలు
చేసారట. అంతేకాదు ఇప్పటిదాకా టెలివిజన్ చరిత్రలో లేని విధంగా ఎన్టీఆర్కి కళ్లు
చెదిరే రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారని సమాచారం.