Advertisement

గోరు వెచ్చని నీరు తాగితే ఏమిటి లాభాలు

By: chandrasekar Sat, 13 June 2020 11:12 AM

గోరు వెచ్చని నీరు తాగితే ఏమిటి లాభాలు


ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటే చాలు. ఆ ఆహారమే ఓషదమై మనలోని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతోంది. ఇంట్లో తయారు చేసే కొన్ని ఔషదాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటి గోరువెచ్చని నీరు.

గోరువెచ్చని నీటి లో తేనె, మిర్యాలపొడి కలుపుకొని తాగితే మనలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తేనె, మిర్యాలపొడిలో యాంటీబయాటిక్‌ లక్షనాలుంటాయి. వీటిని గోరువెచ్చని నీటీలో కలుపుకొని తాగితే కరోనా వంటి సమస్య కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయట. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె, వేయించిన వాము కలిపి తాగితే అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, తాజాగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి.

the benefits,of drinking,nail warm water,healthy,digestion ,గోరు, వెచ్చని, నీరు ,తాగితే ,ఏమిటి లాభాలు


హాట్ వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది బ్లడ్ సర్కులేషన్‌ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్‌ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే క్రమం తప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేమగా, వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై, ఫ్లాకీ స్కిన్‌కు చాలా గొప్పగా సహాయపడుతుంది. శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.

దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతరం వేధించే పొడి దగ్గును తగ్గించి శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tags :

Advertisement