Advertisement

  • తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా పాజిటివ్ కేసులు..8 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా పాజిటివ్ కేసులు..8 మంది మృతి

By: Anji Sun, 20 Sept 2020 12:04 PM

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా పాజిటివ్ కేసులు..8 మంది మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజు రెండు వేలు దాటి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2137 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య లక్షా 71306కు చేరింది. నిన్న కరోనాతో పోరాడుతూ 8 మంది మరణించారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 1033కు చేరింది. ప్రస్తుతం 30573 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 39,700 మంది ఈ మహహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,192 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,39,700కి చేరింది. ప్రస్తుతమున్న 30,573 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,019 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 24,88,220కి చేరింది.

Tags :
|

Advertisement