వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు మరియు 9 మంది పరిస్థితి విషమం
By: chandrasekar Sat, 24 Oct 2020 09:26 AM
రోడ్డు ప్రమాదంలో వ్యాన్
బోల్తా పడడంతో ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు మరియు 9 మంది పరిస్థితి విషమంగా
ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ
శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యాన్ బోల్తా పడింది. జి.మాడుగుల మండలం, గడుతురు
ఘాట్ రోడ్డు మగతపాలెం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఓ
మహిళ మృతి చెందింది.
ఈ రోడ్డు ప్రమాదంలో 35
మందికి గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు గాయపడ్డ వారందరినీ జి.మాడుగుల ఆస్పత్రికి
తరలించారు. బాధితులు జీకే వీధి మండలం రింతాడా పంచాయతీ కడుగుల గ్రామస్తులని
తెలిసింది. అయితే ఈ గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని
వైద్యులు చెబుతున్నారు.
ప్రమాదంలో గాయాలపాలైన
వారు కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక
సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని
పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అసలు
ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు
సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది.