Advertisement

పుట్టి మునక.. కృష్ణా నదిలో నలుగురు గల్లంతు

By: chandrasekar Mon, 17 Aug 2020 11:24 PM

పుట్టి మునక.. కృష్ణా నదిలో నలుగురు గల్లంతు


మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద సోమవారం కృష్ణానదిలో పుట్టి మునిగిన దుర్ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు.

ఈ ప్రమాదం నుంచి 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పుట్టిలో ప్రయాణించిన వారు కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న పుట్టి మునిగి పోయింది.

Tags :
|
|

Advertisement