శరీరం డీహైడ్రేషన్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
By: chandrasekar Fri, 22 May 2020 6:11 PM
ఈ ఎండలవల్ల శరీర
ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీనివల్ల
ఒళ్లు అలసిపోయి నీరసం ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితి రాకూడదంటే శరీర ఉష్ణోగ్రతలు
పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర
ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే ఒంటికి వేడిచేసే ఆహార
పదార్థాలు తినకూడదు.
రోజు నిమ్మ రసం మరియు
కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. దానిమ్మ పండులో శరీరంలో వేడిని
తగ్గించే లక్షణం ఉంది. రోజు లేదా రెండుమూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం
లేదా దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది. రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా
నువ్వుల నూనె తో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల శరీరం
చల్లబడుతుంది. రోజూ రెండు కప్పులు తాటి
బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల శరీర
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.