పైనాపిల్ లో ఎన్ని అమూల్యమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా
By: Sankar Mon, 07 Sept 2020 7:28 PM
మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా పండ్లకు మనలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొన్ని పండ్లను సలాడ్ రూపంలోగానీ, జ్యూస్ రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు కూడా ఒకటి. మరి అనాస పండువల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..!
1. అనాస పండు జ్యూస్ తాగడం ద్వారా వాతం తగ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. పైనాపిల్ తినడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
3. ఆడవారిలో నెలసరి సక్రమంగా వచ్చేందుకు అనాస తోడ్పడుతుంది.
4. పండిన అనాస పండు తినడం ద్వారా పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
5. పూర్తిగా పండకుండా దోరగా ఉన్న అనాస పండు రసం తాగడం ద్వారా కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
6. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి అనాస రసం ఇవ్వడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
7. అనాస పండు తినడం వల్ల వాపులు, నాసికా సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. అనాస పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
9. అనాస పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. అనాస పండు రసంతో ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. అంతేకాకుండా ముఖంపై నల్లటి మచ్చలను కూడా తొలగిస్తుంది.