Advertisement

ఇది అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది....

By: chandrasekar Fri, 11 Dec 2020 1:09 PM

ఇది అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది....


పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తుతెలియని రాళ్లతో దాడిచేశారు

బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్న నడ్డా క్షేమంగా బయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ గూండా రాజ్యంగా తయారైందని నడ్డా ధ్వజమెత్తారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పలు కార్లు, మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి.

నడ్డాపై దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దాడి అధికార టీఎంసీ గుండాల పనేనని నడ్డా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై తక్షణమే నివేదికను పంపాలని గవర్నర్‌ను కేంద్ర హోం శాఖ కోరింది.

సీఎం మమతా బెనర్జీ బీజేపీ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. నడ్డాపై దాడి ఓ డ్రామా, అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఇది ప్లాన్ ప్రకారం జరిగింది చాలు మీ అబద్దాలను మేము సహించం దాడిలో ఏదైనా కుట్ర ఉంటే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేస్తారు అని మమత ఎదురు దాడికి దిగారు. ఇంత మంది సీఐఎస్ఎఫ్-బీఎస్ఎఫ్ కమాండోలు ఉన్నప్పుడు వారు మీ కారుపై ఎలా దాడిచేయగలిగారు అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు తుపాకీలతో బయటకు వస్తున్నారు. తమకు తామే గొడవలు సృష్టించి ఆ నిందలు తృణమూల్ కాంగ్రెస్‌పై వేస్తున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు భద్రత కల్పించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదన్నారు. మీవైపు తప్పు ఉంచుకుని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ప్రశ్నించారు.

Tags :
|
|
|

Advertisement