రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోడానికి
By: chandrasekar Tue, 18 Aug 2020 9:05 PM
రక్తం శుద్ధిగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇందుకోసం మనం కొన్ని చిట్కాలు పాటించినట్లైతే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. రక్త ప్రసరణ వ్యవస్థలో కొంచెం తేడా వచ్చినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తప్పకుండా రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.
మాములుగా శరీరంలో రక్తం ఊపరితిత్తుల్లో శుభ్రపడుతుంది. రక్తంలోని మలినాలను మూత్రపిండాలు వడపోస్తాయి. ఊపిరి తీత్తులు గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేయడానికి మనం తీసికొనే ఆహరం ద్వారా వీలవుతుంది.
1. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోండి.
2. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.
3. అల్లంరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే రక్తంలోని మలినాలు బయటకు వస్తాయి.
4. రోజూ కనీసం ఒక అరగంట నడిస్తే క్యాలరీ తగ్గి, శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్త మెరుగుపడుతుంది.
5. వారానికి రెండు, మూడు సార్లు బీట్రూట్ను తీసుకుంటే శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది.
6. నీటిలో కాస్త సోంపు కలిపి తాగితే రక్తంలో కొవ్వు పరిమాణం తగ్గడమే కాదు, అధిక బరువును నియంత్రిస్తుంది.
7. రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
8. శరీరంలో కొత్త కణాల తయారీ ప్రక్రియకు వెల్లుల్లి సహకరిస్తుంది.
9. రోజూ వ్యాయమం చేస్తే రక్తంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోతాయి.
10.
రోజు ఆహారంలో మునగాకు, కందిపప్పు, కోడిగుడ్డు మరియు నెయ్యి తీసుకుంటే శరీరంలో రక్తం శుభ్రపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.