Advertisement

  • మోతాదు మించితే ఉప్పుతో అనారోగ్యమే అంటున్న నిపుణులు

మోతాదు మించితే ఉప్పుతో అనారోగ్యమే అంటున్న నిపుణులు

By: chandrasekar Tue, 30 June 2020 5:57 PM

మోతాదు మించితే ఉప్పుతో అనారోగ్యమే అంటున్న నిపుణులు


మన నిత్య జీవితంలో ఉప్పు మనం తీసుకునే ఆహారంలో అత్యంత ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే దాన్ని మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం. లేకపోతే అనారోగ్యమే. 40శాతం సోడియం, 60శాతం క్లోరిన్ ఉండే ఉప్పు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సమర్ధంగా పనిచేసేట్టు చేస్తుంది. రక్తప్రసరణ సాఫీగా సాగేట్టు చూడటమే కాకుండా కండరాలు ఉత్సాహంగా పనిచేసేలా ఉంచుతుంది.

ఉప్పు శరీరంలో అవసరమైన నీటిశాతాన్ని ఉంచేలా చూసుకుంటుంది. చిన్న పేగులకు కావాల్సిన ఆహారాన్ని సరఫరా చేయడంలో ఉప్పుదే కీలక పాత్ర. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన ఉప్పు తగు మోదాలులో తీసుకోకపోతే సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీముఖ్యంగా చిన్నారుల ఆహారంలో ఉప్పును మోతాదులో వాడకపోతే వారికి అనారోగ్యాన్ని కొనితెచ్చినవాళ్లం అవుతామని చెబుతున్నారు.

పిల్లలో ఉప్పు ఎంత వాడాలో వాటి వివరాలు:

* 1-3 సంవత్సరాల లోపు చిన్నారులకు రోజూ తీసుకునే ఆహారంలో 2 గ్రాములు

* 4-6 వయసులో ఉన్న చిన్నారులకు 3గ్రామలు

* 7-10 వయసున్న పిల్లలకు 5 గ్రాములు

* 11సంవత్సరాలు ఆపైన వయసున్న పిల్లలకు 6గ్రామలు ఉప్పు ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే మాములుగా దొరికే ఆహారం, జంక్ ఫుడ్, పాపాడ్, నిల్వ ఉంచిన చట్నీలు, బ్రెడ్, బేకరీ తినుబండారాలతో పాటు మైదా ఉత్పత్తుల నుంచి తయారు చేసే నూడుల్స్, పాస్తా వంటి ఆహార పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుందని వైద్యులు హైచ్చరిస్తున్నారు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఆహారంలో ఉప్పుశాతం మోతాదుకు మించి తీసుకుంటే దీర్ఘకాలంలో పిల్లలకు హైపర్ టెన్షన్, తరచూ తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, బుద్ధి మందగించడం, హర్మోన్ల సమన్వయలోపంతో పాటు మరికొన్ని సార్లు డయాబెటిస్ కు సైతం దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, స్థూలకాయం, కిడ్నీల్లో రాళ్ల ఏర్పడటం, శరీరంలో నీటిశాతం ఎక్కువ ఉబ్బడం వంటి సమస్యలు తప్పవని అందుకే ఉప్పు వాడకంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక ఉప్పు చిన్నారులకే కాదు పెద్దలకూ చెడు అని వైద్య నిపుణులు తెలియజేసారు.

Tags :
|
|

Advertisement