ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మరసం, పసుపు
By: chandrasekar Sat, 20 June 2020 5:33 PM
ఆరోగ్యాంగా ఉండడానికి
అందరూ ఎన్నో చిట్కాలు చేబుతుంటారు. వాటిలో యిప్పుడు చెప్పే చిట్కా ఎంతో
ఉపయోగమైనది. నిమ్మరసం, పసుపు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటి వల్ల
మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఈ రెండింటినీ కలిపి
తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో
కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలుపుకుని తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం
ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం
రక్షింపబడుతుంది.
* కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల
నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ సీజన్లో ఎదురయ్యే శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ
లభిస్తుంది.
* చర్మం సంరక్షింపబడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ
సీజన్లో చర్మం పగలకుండా ఉంటుంది.
* నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల
శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.