Advertisement

మమతా బెనర్జీని హెచ్చరించిన గవర్నర్...

By: chandrasekar Fri, 11 Dec 2020 11:58 PM

మమతా బెనర్జీని హెచ్చరించిన గవర్నర్...


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి నేపథ్యంలో బెంగల్​ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు​. మమతా అగ్నితో ఆటలాడకూడదని ఘాటు కామెంట్స్ చేశారు.

మమత చేసిన కామెంట్లకు ఆమె మన్నింపు అడగాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలా ఇలాగ మాట్లాడతారని ప్రశ్నించారు​. రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు ధనకర్​. చట్టాన్ని ఉల్లంఘించే వారికి బెంగాల్​ పోలీసులు, యంత్రాంగం రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి విషయంపై స్పందించిన మమతా బీజేపీ ర్యాలీల్లో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్​పై దాడి చేయించారని ఆరోపించారు మమత.

Tags :
|

Advertisement