రోగ నిరోధక శక్తి పెరగడానికి సులువైన మార్గాలు
By: chandrasekar Thu, 21 May 2020 5:59 PM
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
దేశంలో లాక్డౌన్ గడువును మూడో పర్యాయం
పొడిగించడం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ గడువును
మూడో పర్యాయం పొడిగించడం తెలిసిందే. మే 17 నుండి తాజా
లాక్డౌన్ మే 31 వరకు అమలులో ఉంటుంది. అయితే దేశంలో గత కొద్ది వారాలుగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కరోనా
అదుపులోకి రాకపోగా, కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య అంతకంతకు
పెరిగిపోతోంది. అందువలన మనం ఆరోగ్యం
కాపాడుకునేందుకు చిన్న చిట్కాలు పాాటించాలి. ఈ విషయాలు తెలిస్తే మీరూ రక్తదానం
చేస్తారు.
రోగ నిరోధక శక్తి
పెంచుకునేందుకు కొన్ని సులువైన మార్గాలను మనం తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి చాలా
అవసరం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయడం ఆరోగ్యానికి
చాల మంచిది. శరీరం పునరుత్తేజానికి లోనవుతుంది. మనం తినే ఆహారంలో పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర
ఉండేలా చూసుకోవాలి.
వేసవి కాలం అయినప్పటికీ
చల్లని నీరు కాకుండా కాస్త గోరు వెచ్చని నీటిని తాగాలి. రోజులో కనీసం ఐదారు
పర్యాయాలు వేడి నీటిని తాగడం వల్ల శరీరం ఉత్తేజితమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇలా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇది కోవిడ్19కి చికిత్స మాత్రం కాదని వైద్యులు సూచిస్తున్నారు.